ఈనెల 27న వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావాలని సూర్యాపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి, బీఆర్ఎస్ అభిమాని నరసింహ చారి సతీసమేతంగా వచ్చి జిల్లా పార్టీ కార్యాలయంలో రూ. 1,116 సభ నిర్వహణ కోసం మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి చెక్కుద్వారా సోమవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ ఏ కార్యక్రమం తలపెట్టిన మొదటి నుంచి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నామన్నారు.