రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ కోసం ఈ నెల 31 వరకే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదని, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కట్ ఆఫ్ డేటు ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.