సూర్యాపేట: "మెను ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలి"

6చూసినవారు
సూర్యాపేట: "మెను ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలి"
విద్యార్థులకి మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు. శనివారం సూర్యాపేట మండలం బాలేంల లోని సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ బియ్యం నాణ్యత పరిశీలించారు. , అలాగే స్టాక్ వివరాలు, కూరగాయలు, వంట సామాగ్రి పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్