భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్డీఓ వేణుమాదవ్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామంలో గురువారం తాహశీల్దార్ లాలూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బంది మీకు అండగా ఉంటూ.. మీ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.