జీవితానికి తొలి మెట్టు పదవ తరగతి నుండి మొదలవుతుందని జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా నడచుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని గిరి నగర్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హైస్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరి నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.