గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలనూ వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న అన్నారు. గురువారం సూర్యాపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న మాట్లాడుతూ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇల్లు, ఇండ్ల స్థలాలు, అరులైన వారందరికీ ప్రభుత్వ వాగ్దాన ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని అన్నారు.