సూర్యాపేటలోని కాలనీలలో నెలకున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో జిల్లా కేంద్రంలోని 14 వ వార్డు స్నేహ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపాలిటీలను వార్డులను విస్మరించిందని వార్డులలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారని తెలిపారు.