యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు పాల్గొన్నారు. గ్రామంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మీనర్సింహా రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బాలరాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లలిత, యాదయ్య, నర్సయ్య, లక్ష్మణ చారి, వీరయ్య, పాండు పాల్గొన్నారు.