సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో నందపురం 9వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు, బుధవారం వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటుటకు మున్సిపాలిటీ స్థలం పరిశీలన చేసినారు. జెసిబితో గుంతలు తీయుటకు క్లీనింగ్ చేయుటకు ఆదేశించినారు. మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ దుర్గా రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అఖిల, తదితరులు పాల్గొన్నారు.