రాష్ట్ర ప్రభుత్వం నిరద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్పడం మరోసారి యువతను మోసం చేయడమే అని మంగళవారం అన్నారు. తుంగతుర్తిలో తాటికొండ సీతయ్య మంగళవారం మాట్లాడుతూ లక్షలాది నిరుద్యోగులకు ఆశ కల్పించి దరఖాస్థులు సేకరించిన అనంతరం ఈవిధంగా ప్రకటన చేయడమనేది అన్నివర్గాల యువత ఆశలపై నీళ్లు చల్లిన విధంగా ఉందని అన్నారు.