తుంగతుర్తి: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆవేదన

84చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ రైతు రూపాల మల్లయ్య మాట్లాడుతూ.. కాంటాలు అయినా కూడా బస్తాలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూలుగుతున్నాయి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి లారీలు పంపించాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షం వస్తే మేము తీవ్ర నష్టపోతామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్