సినీ కార్మికుడి అనుమానాస్పద మృతి

584చూసినవారు
సినీ కార్మికుడి అనుమానాస్పద మృతి
TG: ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో సినీ కార్మికుడు మృతి చెందాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పనివెల్లి గ్రామానికి చెందిన హుస్సేన్‌ (55), ఇందిరమ్మ దంపతులు కుమార్తెతో కలిసి ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివాసముంటున్నారు. హుస్సేన్‌ ఇంటికెళ్తూ.. సమీపంలోని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లాడు. దీంతో  అతను అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్