TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శాంతు అనే పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం నలుగురు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే శాంతు మృతదేహం బుధవారం బషీరాబాద్ సెడం (కర్ణాటక) మధ్య రైలు పట్టాలపై లభించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.