అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం గురువారం మధ్యాహ్నం 1.17 గంటలకు విమానం టేకాఫ్ కాగా, మధ్యాహ్నం 1.50 గంటలకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విమానంలో 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పీఎంవో అధికారులు ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడారు.