మన శత్రుదేశమైన పాకిస్తాన్ని ఓ వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఇ తాలిబాన్(టీటీపీ) దెబ్బకొడుతున్నాయి. తాజాగా పాక్ తాలిబాన్లు 30 మంది పాక్ సైనికులను చంపినట్లు శుక్రవారం రాత్రి పేర్కొంది. తాలిబాన్లు (తెహ్రీక్ ఇ తాలిబాన్) పాకిస్తాన్ ఆర్మీని ఊచకోత కోస్తూ.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా సరే పాక్ భారత్ని కవ్విస్తూ యుద్ధోన్మాదంతో ప్రవర్తిస్తోంది.