తమిళనాడు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 21 ఆలయాల్లో భక్తులు సమర్పించిన, ఉపయోగంలో లేని 1,000 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులను కరిగించి 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా మార్చింది. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా, ప్రతీ ఏటా సుమారు ₹17.81 కోట్లు వడ్డీగా వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. ఆలయాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా ఇది ఒక వినూత్న ఆచరణ అంటూ పలువురు కొనియాడుతున్నారు.