అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'తండేల్' మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. భారీ అంచనాలు నడుమ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ చిత్రం రూ. 21.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ 'ఎక్స్' వేదికగా శనివారం ప్రకటన చేశారు.