భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కింద పెద్దలు, పిల్లల రక్షణ విషయంలో
టాటా మోటార్స్కు చెందిన ఎస్యూవీలు సఫారీ, హారియెర్లు ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. దేశంలో తిరిగే వాహనాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు దీటుగా నిలిపేందుకు వీలుగా భారత్-ఎన్క్యాప్ ను గత ఆగస్టులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సఫారీ, హారియెర్ భారత్-ఎన్క్యాప్ కింద సర్టిఫై కావడం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆ కంపెనీని అభినందించారు.