బెంగాల్లోని ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. ఇటీవల జరిగిన 25 వేల టీచర్ పోస్టుల నియామకాల్లో అవకతవకల జరిగాయని పేర్కొంటూ.. ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి ఆందోళన చేశారు. తాజాగా దీనిపై విచారించిన కోర్టు.. కొత్త నియామకాలు వచ్చేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం తీర్పునిచ్చింది. విద్యార్థుల భవిష్యత్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.