టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ తల్లి సీమా గంభీర్ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐదు టెస్ట్ల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న గంభీర్ ఇంగ్లాండ్ నుంచి భారత్కు బయలుదేరినట్లు క్రీడావర్గాల సమాచారం.