రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మృతి చెందారు. హైద్రాబాద్ నారాయణగూడ వద్ద బైకును ఆటో ఢీ కొట్టడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగరాజు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా రంగరాజు గౌడ్ వాడిగూడలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.