రేషన్కార్డుల జారీ సహా పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. మూడో తేదీ నుంచి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు
అమెరికా వెళ్లనుంది. దీనికి ముందుగా జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.