తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ శనివారం సాయంత్రం భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ముఖ్యంగా వనరుల సమీకరణపై మంత్రుల సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.