రేవంత్ లాంటి మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయిందని KTR మండిపడ్డారు. రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పేనని విమర్శించారు. మల్కాజ్గిరిలో జరిగిన BRS సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు BRSలో చేరారు. KTR వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు అవుతుందని.. పదేపదే మోసపోతే అది మన తప్పవుతుందని చెప్పారు. ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలన్నారు.