రాజస్థాన్లో కుండపోత వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారి ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఓ యువకుడు తల్లిని బైక్పై తీసుకెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారికి సమీపంగా దూసుకెళ్లి నీటి ప్రవాహంలో తల్లీకొడుకును కింద పడేసింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు కారును నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.