కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

53చూసినవారు
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి వారు అక్కడే ఉండిపోయారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా 18 మంది వెళ్లారు. కేదార్‌నాథ్‌ దర్శనం తర్వాత 14 మంది తిరుగు ప్రయాణమయ్యారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా నిజామాబాద్‌, విజయనగరం యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్ర చలి కారణంగా వీరు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్