తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు ఉండడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తి అని ఆయనను అగౌరవ పరచడం తమ ఉద్దేశం కాదన్నారు. చర్లపల్లి రైల్వేస్టేషన్కు ఆయన పెట్టేలా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.