తెలంగాణ సచివాలయం వద్ద యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో 21 రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలనే డిమాండ్తో.. వివిధ యూనివర్సిటీల పార్ట్టైమ్ ఉద్యోగులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.