భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వేళ పాకిస్తాన్ ప్రతీకార దాడికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూంఛ్ సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగుతోండగా మూడు చోట్ల డ్రోన్లు కనిపించాయని డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. వరుసగా రెండో రోజు పాక్ దాడులకు దిగడంతో ఇండియా ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జమ్మూకశ్మీర్తో పాటు పంజాబ్, రాజస్థాన్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.