భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘాను పెంచారు. 11 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 10 సైరన్లు ఏర్పాటు చేశారు. కొన్ని సైరన్ శబ్దాలు రెండు కి.మీలు, కొన్ని నాలుగు, మరికొన్ని 16 కి.మీ పరిధి వరకు వినిపిస్తాయి.