యూపీలోని వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్పూర్లో బైక్పై రీల్స్ చేస్తు వెళుతున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.