రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దుండగులు గొంతుకోసి చంపారు. కారులో ఇద్దరు యువకులు, యువతి వచ్చి హత్య చేసినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి 20 రోజుల క్రితమే అలీ హైదరాబాద్ వచ్చారు. ఈ మేరకు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్, పోలీసులు.. క్వాలిస్ వాహనంతో పాటు 2 ఫోన్లు సీజ్ చేశారు.