రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (M) కందవాడ స్టేజీ సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. చేవెళ్ల నుంచి హైదరాబాద్కు రాజశేఖర్రెడ్డి డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా.. కేసారం గ్రామానికి చెందిన కవగూడెం రాజశేఖర్ రెడ్డికి చెందిన కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమై రాజశేఖర్రెడ్డి కారులో నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని తెలిపారు.