తెలంగాణలో అర్హులైన కవులు, కళాకారులకు హామీ ఇచ్చిన రూ. 6 వేల పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమకు పెన్షన్తో పాటు ఆరోగ్య బీమా సదుపాయం, ప్రత్యేక హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి.. అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.