'ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు.. ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ' అనేది ప్రధాని నరేంద్ర మోదీ రహస్య అజెండా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మన హక్కుల రక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని సీఎం రేవంత్ సూచించారు.