ధోనీని క్రికెట్లో మిస్టర్ కూల్గా పిలుస్తుంటారు. బయట కూడా శాంతంగా ఉండే ఈ ధోని తనకు చాలా సార్లు కోపం వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఓ సారి IPLలో మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వెళ్లినట్లు చెప్పారు. తాను చేసిన పెద్ద తప్పు అదేనన్నారు. ఈ విషయమై అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందని, ధోనీ లాంటి ప్లేయర్ ఇలా చేయడమేంటని చర్చించుకున్నట్టు వెల్లడించారు.