TG: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన కాంగ్రెస్ కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణకు నాయకత్వం వహించలేదని, కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకత్వం వహించారని ఆరోపించారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం వహించామని తెలిపారు. తాము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని, కాంగ్రెస్ చొరవతోనే రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు.