సరిహద్దుల్లో పాక్ చేస్తున్న ఉల్లంఘనలకు భారత సైన్యం తగిన విధంగా స్పందించేందుకు రెడీగా ఉందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉల్లంఘనలను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారం కల్పించామని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిస్రీ పేర్కొన్నారు. అలాగే ఉల్లంఘనలను తిప్పికొట్టేందుకు అవసరమైన అన్ని ఆదేశాలు సైన్యానికి అందాయని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేశారు.