అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం
యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కీలక వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విమాన ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నింపింది.