అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరించిన పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ మరణించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళగూరి మొహల్లాలోని తన నివాసంలో శనివారం ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపనలో 121 మంది వేద బ్రాహ్మణులకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో పూజలన్నీ పూర్తయ్యాయి.