రామమందిర ప్రధాన అర్చకుడు కన్నుమూత

57చూసినవారు
రామమందిర ప్రధాన అర్చకుడు కన్నుమూత
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరించిన పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ మరణించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళగూరి మొహల్లాలోని తన నివాసంలో శనివారం ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపనలో 121 మంది వేద బ్రాహ్మణులకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో పూజలన్నీ పూర్తయ్యాయి.

సంబంధిత పోస్ట్