మానవాభివృద్ధి సూచీలో 2022లో 133వ స్థానంలో ఉన్న భారత్.. 2023లో 130వ స్థానానికి చేరిందని యూఎన్డీపీ నివేదిక వెల్లడించింది. మానవాభివృద్ధి సూచీ-2025 ప్రకారం.. భారత్ 0.685 సూచీ విలువతో 193 దేశాలలో 130వ స్థానంలో, మధ్యమ మానవాభివృద్ధి శ్రేణిలో ఉంది. పాకిస్థాన్ 0.544 విలువతో 168వ స్థానంలో, అట్టడుగు శ్రేణిలో ఉంది. ఆదాయ, ఆరోగ్య, విద్యలో భారత్ మెరుగైన పురోగతి సాధించగా.. పాకిస్థాన్ ఆర్థిక అస్థిరత, విద్య, ఆరోగ్య లోపాలతో క్షీణిస్తోంది.