రైతును తొక్కి చంపిన ఏనుగులు

78చూసినవారు
రైతును తొక్కి చంపిన ఏనుగులు
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. పీలేరు మండలం ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్న మామిడి తోటలోకి 15 ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఈ క్రమంలో అడ్డుపడిన రాజారెడ్డి అనే రైతును ఏనుగులు తొక్కి చంపేశాయి. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల నుంచి తమను కాపాడాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్