అల్లు అరవింద్, బన్నీ వాసు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ... గేమ్ ఛేంజర్, తండేల్ మూవీలు ఘోరంగా పైరసీకి గురయ్యయన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్సుల్లో తండేల్ను ప్లే చేయడం చాలా బాధాకరమని, ఒక సినిమా కోసం వందల మంది కష్టపడి పని చేస్తారని, కానీ కొంతమంది ఆ కష్టాన్ని నాశనం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.