నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అర్చకస్వాములు, వేదపండితులు ఆమెకు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్థప్రసాదాలను అందించారు.