మధ్యప్రదేశ్ గ్వాలియర్లో దారుణ ఘటన జరిగింది. 28 ఏళ్ల నర్సుపై సహోద్యోగి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్వాలియర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాధిత మహిళ దుస్తులు మార్చుకునే గదిలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్లుగా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆమెకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి, వాటిని లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.