ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు పిచ్ ఏర్పాటు పూర్తయింది. లీగ్ దశలో భారత్-పాక్ ఆడిన పిచ్నే క్యూరేటర్లు ఫైనల్ మ్యాచ్కు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచులో పాక్ 244 రన్స్ చేయగా టీమిండియా ఘన విజయం సాధించింది. ఇది వరకు భారత్ మ్యాచ్లన్నీ కొత్త పిచ్లపైనే ఆడిన భారత్ ఫైనల్ మాత్రం దీనిపై ఆడనుందని సమాచారం. ఈ పిచ్పై ఒక మ్యాచ్ ఆడిన అనుభవం భారత్కు ప్లస్ అవ్వనుంది.