ఆధునిక ప్రజా రవాణాకు చిరునామాగా మారిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి పథకం’తో పురోగమన దిశగా ఉన్న ప్రయాణికుల సంఖ్య తిరోగమనంలో పడిపోయిందని, ఈ క్రమంలో తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది.