ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత ప్రయాగ్రాజ్కు వెళ్లే రైలు 16వ ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని ప్రకటించారు. కాసేపటి తర్వాత కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యం అవుతాయని, 12వ ప్లాట్ఫామ్ మీద మరో రైలు ఏర్పాటు చేసినట్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతో రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.