ఈ నెల 30 తో ముగియనున్న ఈ క్రాప్ నమోదు గడువు

63చూసినవారు
ఈ నెల 30 తో ముగియనున్న ఈ క్రాప్ నమోదు గడువు
ఏపిలో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించిన ఈ- క్రాప్ నమోదు గడువు ఈ నెల 30 తో ముగియనుంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ 15వ తేదీతో ముగిసింది. అయితే ఇంకా పలుచోట్ల పంటల నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో 15 రోజలు పొడిగించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి. కాబట్టి ఈ మేరకు రైతులు పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్