భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపిన ఐపీఎల్ మ్యాచ్లు వారం రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే భద్రతా పరంగా అప్రమత్తంగా ఉన్న బీసీసీఐ, మిగతా మ్యాచ్లను కేవలం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ల్లో మాత్రమే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మూడు నగరాల్లో మిగిలిన మ్యాచ్లన్నీ పూర్తి చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.